హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి ఏసీ కంప్రెసర్ పేలడమే కారణమని అధికారులు తేల్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని నిర్ధారించారు. చెక్క మెట్లు, వాహనాల సీటు కవర్లు త్వరగా అంటుకోవటంతో మంటలు వ్యాపించాయన్నారు. సరైన వెంటిలేషన్ లేకపోవడం, ఏసీల అధిక వినియోగం వల్ల కంప్రెసర్ పేలిందని తెలిపారు. ఈ ఘటనలో మెుత్తం 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.