వనపర్తి జిల్లా అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం ముదిరింది. ఎంపీ డీకే అరుణను ఆహ్వానించకుండా మంత్రి శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ ఆమె ఇవాళ భూమి పూజ చేశారు. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. నిరసనల మధ్యే పనులు ప్రారంభించారు. కేంద్ర నిధులను రాష్ట్ర నిధులుగా ప్రచారం చేస్తున్నారని.. మహిళా ఎంపీ అని చూడకుండా దాడులకు దిగడం హేయమైన చర్య అని డీకే అరుణ ప్రభుత్వంపై మండిపడ్డారు.