ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిజిటల్ సమాచారం భద్రతపై ప్రాధాన్యతను వివరించారు. హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ఆయన ప్రారంబించిన సందర్భంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గూగుల్ వంటి వినూత్న సంస్థలకు తెలంగాణ ఒక ఉత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుతోందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాలు పెంపొందిస్తున్నామన్నారు. 2035 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చాలనే లక్ష్యం ఉందని వెల్లడించారు.