మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, మృత్యువు ఎప్పుడు వస్తుందో ఊహించలేం. నిన్నటి వరకు సరదాగా గడిపినవారు అకస్మాత్తుగా కన్నుమూసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా.. హైదరాబాద్లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో (గెట్ టు గెదర్ పార్టీ) విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్ సమ్మేళనానికి హాజరవుతుండగా సిద్దిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆత్మీయ సమ్మేళనం సంతాప సభగా మారింది.