గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు

5 months ago 10
సాధారణంగా గొంతులో చికెన్ ముక్క లేదా మటన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి చనిపోయాడనే వార్తలు వింటుంటాం. చూస్తుంటాం. కానీ దోసె గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో వెంకటయ్య అనే వ్యక్తి మద్యం తాగి.. దోసె తింటున్న సమయంలో అతని గొంతులో దోసె ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికి వెంకటయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Entire Article