నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.