విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు కానుకలు సమర్పించడం ఆనవాయితీ. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన భూపాల్ రెడ్డి అనే భక్తుడు బెజవాడ దుర్గమ్మకు రూ.4.75 లక్షల విలువైన కారు, 21 గ్రాముల బంగారు నెక్లెస్ను కానుకగా అందజేశారు. గతంలో సిరిసిల్లకు చెందిన నేతన్న అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను సమర్పించగా, ముంబైకి చెందిన వ్యాపారవేత్త వజ్రాల కిరీటాన్ని సమర్పించారు. భక్తులు తమ భక్తిని చాటుకుంటూ అమ్మవారికి కానుకలు సమర్పిస్తున్నారు.