హైదరాబాద్ మధురానగర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిట్టీ డబ్బుల విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా.. ఓ వ్యక్తి మహిళ చూపుడు వేలు కొరికేశాడు. గొడవ మధ్యలో కలుగుజేసుందనే కోపంతో క్షణికావేశంలో చూపుడు వేలును పూర్తిగా కొరికేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.