హైదరాబాద్ నగరాన్ని సుందరంగా మార్చడంలో జీహెచ్ఎంసీ ఎల్లప్పుడూ ముందుంటుంది. తాజాగా నగరాన్ని మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ 29 నుండి జనవరి 31 వరకు మెగా శానిటేషన్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజూ సుమారు 300 వార్డుల్లో భారీ స్థాయిలో పారిశుధ్య పనులు జరగనున్నాయి. రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తను తొలగించడమే కాకుండా.. నిత్యం చెత్త వేసే పాయింట్లను శుభ్రం చేసి అక్కడ మొక్కలతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేసే వారికి స్పాట్ ఫైన్లు విధిస్తారు.