Andhra Pradesh Insurance For Sheeps And Goatsఫ ఆంధ్రప్రదేశ్లో లక్షలాది కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఇటీవల వర్షాలు, పిడుగుపాటు, చలి కారణంగా జీవాలు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో పెంపకందారులు భారీగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కేవలం రూ.36 నుండి తక్కువ ప్రీమియంకు బీమా సౌకర్యం కల్పిస్తున్నా, అవగాహన లేక చాలామంది యజమానులు బీమా చేయించుకోవడం లేదు. దీనివల్ల ఒక్కో జీవానికి రూ.6 వేల పరిహారం అందక, ఆర్థికంగా చితికిపోతున్నారు.