Konaseema Bridge Construction On Godavari: కోనసీమ లంకవాసుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసింది. పి.గన్నవరం మండలం జి.పెదపూడి లంక దగ్గర వశిష్ట గోదావరిపై రూ.71.43 కోట్లతో రెండు బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. 2027 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయి, పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పనులు ఊపందుకున్నాయి.