సైబర్ నేరగాళ్లు ట్రెండ్ను బాగా ఫాలో అవుతున్నారు. ఎప్పుడు ఏది ట్రెండ్లో ఉంటుందో దాన్ని ఆసరాగా చేసుకుని.. అమాయక ప్రజలను మోసగించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్యగా ఉన్న గ్యా్స్ కొరతను అడ్డుగా పెట్టుకుని సైబర్ మోసాలకు తెర తీస్తున్నారు. గ్యాస్ బుకింగ్ పేరుతో ఫేక్ లింక్లు పంపించి.. సైబర్ కేటుగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు.