గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులకు ముఖ్య గమనిక. సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణ విధివిధానాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఐదేళ్లుగా ఒకచోట పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు తప్పనిసరి. అలాగే సొంత ఊరితో పాటుగా సొంత మండలాలలోనూ ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం విధివిధానాల్లో స్పష్టం చేసింది. జూన్ 30వ తేదీలోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.