గుండెపోటుకు గురైన వ్యక్తికి మొదటి గంటలో అందించే టెనెక్ట్ ప్లస్ ఇంజక్షన్ను ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్ప్రత్రులలో ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉండనుంది. దీనికి సంబంధించి అవగాహన కల్పించేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం టెనెక్ట్ ప్లస్ ఇంజెక్షన్ వాల్పోస్టర్ను విడుదల చేశారు.