రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకున్నా, రాజధాని హైదరాబాద్లో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నగరంలో స్థలం ఉండి ఇల్లు లేనివారు 18 వేల మంది, రెండూ లేనివారు 8 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా అపార్ట్మెంట్లు కట్టాలా లేక స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. లక్ష ఇళ్లు కడితే పేదల కల నెరవేరుతుందంటున్నారు అధికారులు. కొత్త విధానం కోసం ఎదురుచూస్తున్నారు.