తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన దృష్టి సారించింది. GHMC, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బలంగా పోటీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబరులో గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, ఎంఐఎం మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ప్రజా సమస్యలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు సూచించారు.