CM Revanth Reddy: సూర్యాపేట జిల్లాలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గోదావరి జలాలను తీసుకురావడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. రాబోయే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలోనే నల్గొండ అభివృద్ధి చెందిందని, లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం సంక్షేమ పథకాల గురించి వివరించారు.