వికారాబాద్ జిల్లా కొడంగల్ సమీపంలోని ఐనన్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది.