నిజామాబాద్ జిల్లా భక్తులు మహారాష్ట్రలోని వినాయక దర్శనానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడి ప్రాంతంతో పాటు.. వారి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లింది మొదలు భద్రంగా తిరిగి ఇంటికి వస్తామో రామో తెలియదు. అందుకే వాహనం నడిపే ప్రతీ ఒక్కరు నిర్లక్ష్యం లేకుండా నడపాలి. లేదంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.