Chandrababu Quantum talk with Students: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బంపరాఫర్ ప్రకటించారు. గతంలో ఐటీని ప్రోత్సహించిన చంద్రబాబు.. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టెక్ విద్యార్థులతో మంగళవారం రోజున చంద్రబాబు క్వాంటం టాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి ఎవరైనా క్వాంటం టెక్నాలజీ రంగంలో నోబెల్ పురస్కారం సాధిస్తే.. వారికి రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఏపీ దేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి నాయకత్వం వహిస్తుందన్నారు.