పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జరిగే ఈ భేటీలలో ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, అభివృద్ది పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించనున్నారు.