తిరుమల నెయ్యి కల్తీ కేసులో సిట్ నివేదిక తర్వాత వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేష్ల కప్పిపుచ్చుకునే రాజకీయాలకు పవన్ కళ్యాణ్ బానిసగా మారి మద్దతు తెలుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న ఈ ముగ్గురు నేతలకు పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు.