విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. యువత పోరు పేరుతో వైసీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబుకు తొలి హెచ్చరిక పంపారన్న వైఎస్ జగన్.. ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.