వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపడతానన్న జగన్.. అప్పటి నుంచి ప్రతి రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు భయపడాల్సిన పనిలేదని.. కార్యకర్తలు, నేతలకు సూచించారు. కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.