ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో శనివారం పర్యటించారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని టెకీలతో ఆయన ముఖాముఖి నిర్వహించి.. వారు సాధించిన విజయాలు గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో ఓ యువకుడు తనకు ఏడాదికి రూ.93 లక్షల జీతం వస్తుందని చెప్పడంతో అభినందించారు. అయితే, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.