ఏపీ సీఎం చంద్రబాబుపై.. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో గుంటూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి టీడీపీ కార్యకర్తలు యత్నించడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై అంబటి రాంబాబు స్పందించారు. తాను చంద్రబాబును తిట్టలేదని.. తనను అడ్డగించి, తిడుతున్నవారిని మాత్రమే తిట్టానని అన్నారు. మనిషిగా వాళ్లు తిడుతుంటే తానూ తిట్టానన్న అంబటి రాంబాబు.. ఈ వయసులో అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు.