తెలుగు సినిమా పరిశ్రమను పీడిస్తున్న పైరసీ భూతానికి తెలంగాణ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలను పైరసీ చేసి, పరిశ్రమకు రూ.3,700 కోట్ల నష్టం కలిగించిందని పోలీసులు తెలిపారు. టెలిగ్రామ్, టొరెంట్స్, థియేటర్ రికార్డింగ్, డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్ వంటి పద్ధతులతో వీరు 500కు పైగా చిత్రాలను పైరసీ చేశారని వెల్లడించారు.