చదువు చెప్పిన గురువుకు శిష్యుడి షాక్.. సీసీ ఫుటేజ్‌తో అడ్డంగా బుక్, ఏం చేశాడంటే!

8 months ago 12
Ramachandrapuram Theft Case: కోనసీమ జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. ఒకప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఇంటికే కన్నం వేసిన శిష్యుడి ఉదంతమిది. రామచంద్రపురానికి చెందిన వీరబ్రహ్మం అనే వ్యక్తి, తన గురువు శ్రీనివాస్ ఇంటిని దోచుకున్నాడు. శ్రీనివాస్ విశాఖపట్నం వెళ్లిన సమయంలో, ఇంటి తాళం పగలగొట్టి రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్టు చేశారు, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article