రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆసక్తిర సన్నివేశం చోటు చేసుకుంది. చదువు చెప్పిన గురువు స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండగా.. ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న స్టూడెంట్ అదే స్టేషన్కు ఎస్సైగా వచ్చారు. దీంతో గురువు ఆమెకు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. ఈ చర్యతో ఎస్సై భావోద్వేగానికి గురయ్యారు.