తెలంగాణ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమయ్యారు. చర్చలకు పిలవకపోతే రేపు ఉదయం నుంచే సమ్మె చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.