హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే స్టేషన్లో సరికొత్త స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. విమానాశ్రయ తరహాలో ఉండే ఈ పడక గదులు ప్రయాణికులకు తక్కువ ధరకే విలాసవంతమైన విశ్రాంతిని అందిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 32 పడకలు ఉండగా.. మహిళలకు మరియు పురుషులకు విడివిడిగా కేటాయించారు. ధరల విషయానికొస్తే.. 2 గంటలకు రూ. 200 నుంచి ప్రారంభమై, ఒక రోజుకు రూ. 1200 వరకు ఉన్నాయి. న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగల వేళ రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో.. ఈ సౌకర్యం సరైన సమయంలో అందుబాటులోకి వచ్చిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.