చార్మినార్ ప్రాంతంలో షాపింక్ కోసం వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేవారికి తీపి కబురు. త్వరలోనే పార్కింగ్ కష్టాలు తీరిపోనున్నాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. చార్మినార్ బస్టాండ్ ప్రాంతంలో 4 వేల చదరపు గజాల స్థలంలో కొత్తగా పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.