గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో హైదరాబాద్లో మాంసం మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఆదివారం కావడంతో చికెన్, మటన్, చేపల దుకాణాల వద్ద జనం బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. పండుగ తర్వాత నాన్-వెజ్ ప్రియులు మాంసం కొనుగోలుకు ఆసక్తి చూపడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.