చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలెక్టర్, వైద్య శాఖ అధికారి సంతకం ఫోర్జరీ చేసి లక్షలు కాజేసిన వైనం బయటపడింది. కలెక్టర్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు సమన్వయ అధికారి పేరుతో ఉన్న సంయుక్త ఖాతా నుంచి రూ.6.99 లక్షలు కాజేసినట్లు రుజువైంది. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు ప్రారంభించారు.