Shocking Twist In Chittoor Robbery: చిత్తూరులోని గాంధీరోడ్డులో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేపాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల ఘటనలో కీలక మలుపు: అనంతరం దొంగల కాల్పుల ఘటనలో కీలక మలుపు తీసుకుంది. ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో ప్రముఖ వ్యాపారి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు.