ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి జిల్లాలోని ఓ స్కూలులో మాత్రం 300 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం డబ్బులు అందలేదు. తిక్కవరం పాఠశాలలో సుమారుగా 300 మంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు పడలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించాలని వీరు కోరుతున్నారు.