సంగారెడ్డి జిల్లాలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళ చేసిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. అమీన్పూర్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతుండగా.. అది అదుపు తప్పి.. పక్కనే ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో మణిధర్ వర్మ అనే పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరి ఏకవాణి తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ సరదాగా చేసిన పని ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది.