ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం రోజున నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఉండ్రాజవరంలోని మైత్రేయ బుద్ధ విహార్లో జరిగిన కలశ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బౌద్ధ ధర్మ పీఠం సేవలను ప్రశంసించారు. విద్యార్థులకు విద్య. వైద్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా, ధ్యానం వంటి అంశాలలో ఉచితంగా శిక్షణ అందించడం గొప్ప విషయమంటూ అభినందించారు. మరోవైపు 2017లో బౌద్ధ ధర్మ పీఠం ఏర్పాటైంది.