ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయ్యిందన్న చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ అంబటి రాంబాబు ఈ అంశంపై స్పందించారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయ్యిందన్న విషయం ఇంత ఆలస్యంగా చెప్పారేంటని సెటైర్లు వేశారు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదని.. కాంగ్రెస్లో చేరిందన్న అంబటి రాంబాబు.. జనసేన కూడా మారి బీజేపీలో చేరుతుందేమో జాగ్రత్త అంటూ ఎద్దేవా చేశారు.