రామ రాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కొందరు చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో ఆయనతో పాటుగా.. కుమారుడిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు సహా పలువురు అనుచరులను అరెస్టు చేశారు.