చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో కన్నుమూసిన సౌందరరాజన్.. ఆలయాల స్వయం ప్రతిపత్తి, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం నిరాటకంగా కృషి చేశారు. ఆలయాలపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి.. పోరాటం చేసిన గొప్ప వ్యక్తి సౌందరరాజన్.