తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చివరి నిమిషంలో నిరాశ ఎదురైంది. ఆయనకు పదవి ఖాయమని విస్తృత ప్రచారం జరిగినా.. లాస్ట్ మినిట్లో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవకాశం దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అడ్లూరికి ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి సిద్ధం కావాలని చెప్పారు. దీంతో కవ్వంపల్లి వర్గీయులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.