చీరాలలో ఫుల్‌గా తాగి ఏఎస్సై రచ్చ.. ఏకంగా సీఐపై దాడికి యత్నం

2 months ago 4
మద్యం మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించారో ఏఎస్సై. సీఐ సహా ఇతర పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గొడవే కాదు.. డ్యూటీలో ఉన్న పోలీసులను పక్కకు తోసేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు పిల్లి రవికుమార్‌. ప్రస్తుతం చీరాల రూరల్ సీఐ కార్యాలయంలో ఆయన విధుల్లో ఉన్నారు. క్రిస్మస్‌ను పురస్కరించుకుని తెల్లవారుజామున చీరాల పట్టణంలోని సెయింట్‌ మార్క్‌ సెంటరీన్‌ లూథరన్‌ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏఎస్సై తన కారులో ఆ ప్రాంతానికి చేరుకున్నప్పుడు పోలీస్‌ రక్షక్‌ జీపుకు ఆయన వాహనం తగిలింది. ఆ వాహనం డ్రైవర్‌.. ఏఎస్సైను ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ సుబ్బారావు అక్కడికి చేరుకుని, ఏఎస్సైకి సర్దిచెప్పబోయారు. అప్పటికే ఫుల్ మద్యం మత్తులో ఉన్న ఏఎస్సై హంగామా చేయడంతో పాటు.. సీఐని.. ఆయన సిబ్బందిని తోసేశారు. దీంతో సీఐకి, ఏఎస్సైకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏఎస్సై.. సీఐపై నోరు పారేసుకున్నాడు. దీంతో వారు అక్కడ నుంచి ఏఎస్సైను కొంతదూరం లాక్కెళ్లి వదిలేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌ సీరియస్ అయ్యారు. ఏఎస్సైను వీఆర్‌కు పంపారు. విచారణ చేయాలని చీరాల డీఎస్పీ మొహ్మద్‌ మొయిన్‌ని ఆదేశించారు..
Read Entire Article