తిరుపతి జిల్లాలో అనూహ్య ఘటన జరిగింది. తొట్టంబేడు మండలం చియ్యవరంలో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. వెంకటేష్ అనే వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉంది. గురువారం రాత్రి మద్యం తాగిన వెంకటేష్ను ఇంటికి వస్తున్న సమయంలో.. పాము కాటేసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న వెంకటేష్ కోపం నషాళానికి ఎక్కింది. పామును తల కొరికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిన పామును ఇంటికి తీసుకెళ్లి పక్కలో పెట్టుకుని నిద్రపోయాడు. అయితే వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి దిగజారటంతో కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.