తెలంగాణలోని పులుల అభయారణ్యాల గుండా ధాన్యం తరలించే లారీల నుంచి వసూలు చేస్తున్న పర్యావరణ నిర్వహణ రుసుమును అటవీ శాఖ తగ్గించింది. గతంలో రూ.525 ఉన్న రుసుమును ప్రస్తుతం రూ.300కి కుదించింది. ఎన్టీసీఏ నిబంధనల మేరకే తాము ఫీజు వసూలు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.