Swachh Ratham Pilot project in Prathipadu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం స్ఫూర్తిని పల్లెలకు సైతం విస్తరింపజేసేందుకు కొత్త ఆలోచన చేసింది. అందులో భాగంగా స్వచ్ఛ రథం కార్యక్రమానికి ఏపీ పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టింది. గుంటూరు గ్రామీణం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. స్వచ్ఛ రథం వద్ద చెత్త అందించిన వారికి.. ఆ చెత్తకు సమానమైన నిత్యావసర సరుకులను ఉచితంగా అందిస్తారు.