ఏపీలోని నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. తొలి విడతగా 84 సొసైటీలకు రూ.2 కోట్లకు పైగా బకాయిలు విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి సవిత వెల్లడించారు. మిగతా బకాయి మొత్తాన్ని కూడా విడతల వారీగా చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. చేనేతల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వివరించారు. మరోవైపు చేనేతల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.