ప్రకాశం జిల్లాలో మిర్చి పంటల మాటున గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. పుల్లలచెరువు మండలం అయ్యవారిపల్లెలో ఓ వ్యక్తి తన మిరప తోటలో గంజాయి సాగు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడులు చేయగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అయితే అదే గ్రామంలో మరో వ్యక్తి వద్ద కూడా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు త్రిపురాంతకం మండలం మేడిపిలో గంజాయి విక్రయిస్తున్న కొందరిని అరెస్ట్ చేసి 1.5 కిలోలకు పైగా గంజాయి, 2 వాహనాలు, ఫోన్లు పట్టుకున్నారు.