బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. ఈ సందర్భంగా.. జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయటాన్ని ఖండిస్తూ.. బీఆర్ఎస్ సభ్యులు నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్.. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (మార్చి 14న) తెలంగాణ వ్యాప్తంగా నిరసనలనలకు పిలుపునిచ్చారు. జగదీష్ రెడ్డి తప్పు చేయలేదని, అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా.. ఇలాంటి చర్యలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు.