జగన్ అసెంబ్లీకి వస్తే ఆ అవకాశం కచ్చితంగా ఇస్తా.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు

1 year ago 24
Chintakayala Ayyannapatrudu: జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని.. అంతే గాని అసెంబ్లీకి రాను అనడం సమంజసం కాదన్నారు ఏపీ శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు. స్పీకర్‌గా జగన్‌కు మాట్లాడే అవకాశమిస్తానని.. స్పీకర్‌గా నాకు అందరూ సమానమే అన్నారు. జగన్‌ ఒక ఎమ్మెల్యే మాత్రమే.. ఆయన శాసనసభకు వచ్చి మాట్లాడాలి అన్నారు. అందుకు జగన్‌కు అవకాశమిస్తా. శాసనసభకు రాననడం సరికాదని, జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే, సీఎం కాదన్నారు. జగన్‌ను పులివెందుల ప్రజలు నమ్మకం ఉంచి ప్రజలు వారి ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు.
Read Entire Article